భారతదేశం, మార్చి 27 -- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. భారత్ తీసుకున్న 'పన్నుల తగ్గింపు' నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఆయన ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగాస్పందిస్తూ.. ఇది మోదీ ప్రభుత్వ 'దార్శనికత' నిర్ణయం అని కొనియాడారు.

గత నెల రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి ఏకంగా 122 డాలర్లకు పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ముందు రెండు దారులు మాత్రమే ఉన్నాయని ఆయన వివరించారు. అవి..

ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలో పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేయడం.

లేదా ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని భరిస్తూ, పౌరులకు రక్షణ కవచంలా నిలవడం.

ప్రధాని న...