భారతదేశం, జూలై 26 -- నర్సంపేట మాజీ శాసనసభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదివారం సడన్‌గా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు లక్షణాలు కనిపించడంతో వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు, ఆయనను చికిత్స నిమిత్తం అత్యవసరంగా వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యులు ఆయన్ను కాపాడేందుకు శ్రమిస్తున్నారు.

విషయం తెలుసుకున్న వెంటనే బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తానీరు హరీశ్ రావు తమ పర్యటనలను రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ నుంచి వరంగల్ బయల్దేరి వెళ్లారు.

Published by HT Digital Content Services with permission fr...