భారతదేశం, జూన్ 2 -- Buchibabu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. ఈ సినిమాకు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ వర్గాల్లో తీవ్రంగా హల్‌చల్ చేస్తోంది. తన రెండో సినిమా పెద్దికే ఈ స్థాయి భారీ బడ్జెట్ లభించడంపై దర్శకుడు బుచ్చిబాబు సాన స్వయంగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తన మొదటి సినిమా 'ఉప్పెన'ను కేవలం రూ.25 కోట్ల పరిమిత బడ్జెట్‌తో అద్భుతంగా తెరకెక్కించి బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల వసూళ్లతో ఘన విజయాన్ని అందుకున్నాడు బుచ్చిబాబు. అయితే, తన రెండో సినిమా పెద్దికే నిర్మాతలు ఇంత భారీ మొత్తాన్ని కేటాయిస్తారని తాను అస్సలు ఊహించలేదని ఆయన మైక్ ముందు ఓపెన్ అయ్యాడు. పెద్ది కోసం రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించాడ...