భారతదేశం, జూన్ 6 -- Peddi Controversy: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన 'పెద్ది' సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రణ, కొన్ని వివాదాస్పద సీన్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇన్ స్టాలో పంచుకున్న ఓ లెంగ్తీ పోస్టు హాట్ టాపిక్ గా మారింది.

సినిమాలు సమాజానికి అద్దం పడతాయనేది వాస్తవమే అయినా, సమాజాన్ని మార్చే లేదా ఎడ్యుకేట్ చేసే పూర్తి బాధ్యతను సినిమాపైనే నెట్టేయడం సరికాదని అనసూయ అభిప్రాయపడింది.

"సినిమా అనేది ప్రాథమికంగా ఒక ఊహాజనిత కథ. ఏది తప్పు, ఏది రైటో తెలుసుకునే విచక్షణ, బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంటాయి. సినిమాల ద్వారా పిల్లల పెంపకం జరగాలని నేను అనుకోవడం లేదు'' అని ఆమె స్పష్టం చేసింది.

అయితే ఇదే సమయంలో కథలు చెప్పే...