భారతదేశం, ఏప్రిల్ 2 -- కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌లో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో పంపిణీ చేస్తోంది. దీంతో తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థ(పీడీఎస్) కింద వరుసగా రెండో ఏడాది కూడా ముందస్తు సరఫరా జరగుతోంది. సేకరణ సీజన్‌లో రవాణా, నిల్వ పరిమితులను చెబుతూ.. జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) కింద 2026 జూన్ వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే తీసుకుని పంపిణీ చేయాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

'రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయ ఆహార భద్రతా చట్టం(NFSA) కింద జూన్ 2026 వరకు కేటాయించిన ఆహార ధాన్యాలను ముందుగానే తీసుకుని, వాటిని లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలి. నిల్వలను తీసుకున్న వెంటనే ఏప్రిల్-జూన్ నెలల పంపిణీని పూర్త...