భారతదేశం, మే 22 -- Patriot OTT: కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను ఇష్టపడే సినీ ప్రేక్షకులకు మరో అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ రాబోతోంది. ఇటీవల కాలంలో మలయాళ చిత్రాలకు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు నాట ఎంతటి ఆదరణ దక్కుతోందో మనం చూస్తూనే ఉన్నాం. కథలోని సహజత్వం, ఎమోషన్స్‌ను పండించడంలో మలయాళ మేకర్స్ చూపిస్తున్న నైపుణ్యం మన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

ఈ కోవలోనే తెరకెక్కిన మరో ఆసక్తికరమైన మూవీ 'పేట్రియాట్'. మమ్ముట్టి, మోహన్‌లాల్, ఫహాద్ ఫాజిల్ లాంటి నటీనటులున్నా డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5' ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.

జూన్ 5 నుంచి 'పేట్రియాట్' సినిమాను తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 సంస్థ అధికారికంగా వెల్లడించింది. కేవలం...