భారతదేశం, జూలై 31 -- దేశంలో పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలకు చెక్ పెట్టేందుకు భారత ప్రభుత్వం చట్టాన్ని మరింత కఠినతరం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026' బుధవారం లోక్‌సభ, గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. ఈ కొత్త సవరణల ప్రకారం.. వ్యవస్థీకృత పేపర్ లీకేజీలు, పరీక్షల్లో మోసాలకు పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ.50 లక్షల వరకు జరిమానా విధించేలా కఠిన నిబంధనలను చేర్చారు.

దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ భారీ స్థాయిలో ఆందోళనలు చెలరేగడం, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం వంటి పరిణామాల అనంతరం ఈ బిల్లుకు ప్రాధాన్యం ఏర్పడింది.

కాగా, భారతదేశం ఇప్పుడు కఠినమైన శిక్షలను అమల...