భారతదేశం, జూలై 6 -- వినాయకుని పూజించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి. బుద్ధి, విఘ్నాలకు అధిపతిగా వినాయకుడిని మనం పూజిస్తాము. అలాగే వినాయకుడి అనేక రూపాలు కూడా ఉన్నాయి. వాటిలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన రూపంగా పంచముఖి గణేశుడు ప్రసిద్ధి చెందాడు. ఐదు ముఖాలతో కనిపించే ఈ దైవ స్వరూపం ఐదు దిక్కులను మాత్రమే కాదు, మనిషి జీవితంలోని ఐదు ముఖ్యమైన చైతన్య స్థాయిలకు కూడా ప్రతీకగా భావిస్తారు. వేద సంప్రదాయం ప్రకారం చూసినట్లయితే, పంచముఖిని ఆరాధించడం వలన వివేకం, జ్ఞానం, రక్షణ, ఆధ్యాత్మిక పురోగతి, మానసిక ప్రశాంతత కలుగుతాయి.

పంచముఖి అంటే ఐదు ముఖాలు ఉన్న ఆ దివ్య స్వరూపం. ఈ రూపంలో ఉన్న గణపతిని ఆరాధించడం వలన విఘ్నాలు తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుంది. జ్యోతిష్యం ప్రకారం ఈ రూపాన్ని ఆరాధిస్తే మానసిక సమతుల్యత, ధైర్యం, శుభ ఫలితాలు కూడా లభిస్తాయి.

వేదాలు, ఉపనిషత్తు...