భారతదేశం, మే 20 -- అధిక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అంటాము. ఈ సంవత్సరం ఈ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? విశేషమైన పురుషోత్తమ మాసంలో వచ్చే ఈ ఏకాదశి తేదీ, సమయంతో పాటు పూజా విధానం, పఠించాల్సిన మంత్రాల గురించి కూడా వివరంగా తెలుసుకుందాం.

ఈ పద్మిని ఏకాదశిని పురుషోత్తమ ఏకాదశి లేదా కమల ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే విష్ణు అనుగ్రహం కలిగి పాపాలన్నీ తొలగిపోతాయి. సుఖశాంతులు, ఐశ్వర్యం కలుగుతాయి.

మామూలుగా ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్లపక్షంలో, మరొకటి కృష్ణపక్షంలో. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులను మనం జరుపుకుంటాము. ప్రత్యేకమైన యోగం ఈ పద్మిని ఏకాదశి నాడు రాబోతోంది. ఈ ఏడాది అధిక మాసం కాబట్టి 26 ఏకాదశులు వచ్చాయి. అధిక జ్యేష్ఠ మాస శుక్లపక్...