భారతదేశం, సెప్టెంబర్ 14 -- ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి దూర విద్య కేంద్రం (PGRRCDE) ద్వారా వివిధ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు మరో అప్డేట్ వచ్చింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను యూజీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుండగా.. దరఖాస్తు చివరి తేదీని అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగించారు. ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని వర్సిటీ వర్గాలు తెలిపాయి.

పీజీ కోర్సులకు సంబంధించి బోధనా మాధ్యమం ప్రధానంగా ఇంగ్లీష్‌లో ఉంటుంది. అయితే ఎంఏ తెలుగు, హిందీ, ఉర్దూ కోర్సులతో పాటు ఎంఏ పొలిటికల్ సైన్స్ కోర్సు తెలుగు మాధ్యమంలో కూడా లభిస్తుంది. డిగ్రీ కోర్సులకు ఇంగ్లీష్, తెలుగు బోధనా మాధ్యమాలు అందుబాటులో ఉంటాయి. విశ్వవిద్యాలయ నిబంధనల ప్రకారం.. ఏదైనా నిర్దిష్ట కోర్సును నిర్వహిం...