భారతదేశం, మార్చి 19 -- దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ జేపీ దత్తా క్లాసిక్ 'బోర్డర్' మూవీకి సీక్వెల్‌గా ఈ ఏడాది జనవరిలో విడుదలైన 'బోర్డర్ 2' చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం, ఇప్పుడు ఇంట్లోనే కూర్చుని చూసేందుకు ఓటీటీ రిలీజ్ అవుతోంది.

ఈ యుద్ధ వీరుల గాథను థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారి కోసం మరికొన్ని గంటల్లో బోర్డర్ 2 ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన బోర్డర్ 2 మూవీ వార్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కింది.

బోర్డర్ 2 మూవీలో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి, దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. వీరితోపాటు సోమన్ బజ్వా, మేధా రాణా, మోనా సింగ్, ఆన్యా సింగ్, పరమ్‌వీర్ చీమ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

2026 జనవరి 23న...