భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఓటీటీలో తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ నయనం అదరగొడుతోంది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లో దూసుకెళ్తోంది. హీరోగా థియేటర్లలో వరుస ఫ్లాప్ లు ఎదుర్కొన్న వరుణ్ ఈ సిరీస్ తోనే ఓటీటీ డెబ్యూ చేశాడు. ఇందులో కళ్ల డాక్టర్ గా వరుణ్ నటించాడు.

తెలుగు సస్పెన్స్ సైకో క్రైమ్ థ్రిల్లర్ నయనం వెబ్ సిరీస్ ఓటీటీని షేక్ చేస్తోంది. డిసెంబర్ 19, 2025న ఇది జీ5 ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చేసింది. జీ5 ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కింది నయనం. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఈ సిరీస్ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంది.

నయనం వెబ్ సిరీస్ తాజాగా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను దాటింది. ఈ విషయాన్ని పేర్కొంటూ జీ5 ఓటీటీ ఆదివారం (ఫిబ్రవరి 8) సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఓటీటీలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రిక...