భారతదేశం, మే 28 -- OTT Thriller: వైవిధ్యభరితమైన కథలతో ప్రేక్షకులను అలరించే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ థ్రిల్లర్ 'కర' ఓటీటీలోకి వచ్చేసింది. 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఇవాళ (మే 28) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించింది.

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ 'కర' ఓటీటీలోకి వచ్చేసింది. క్రైమ్ హీస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గురువారం నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కర డిజిటల్ డెబ్యూ చేసింది.

కర మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 30, 2026న థియేటర్లలో రిలీజైన ఈ థ్రిల్లర్.. ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో ఈ మూవీ...