భారతదేశం, ఆగస్టు 29 -- OTT Thriller: తెలుగు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓ మూవీ డైరెక్ట్ గా స్ట్రీమింగ్ కు రాబోతుంది. డిజిటల్ వీక్షకుల కోసం మరో ఆసక్తికరమైన క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ సిద్ధమైంది. భరత్ నివాస్, ఉదయభాను, మేధ ముఖ్య పాత్రల్లో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'పంచనామా' (Panchanama) నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. థియేట్రికల్ విడుదల లేకుండానే ఈ చిత్రాన్ని నేరుగా డిజిటల్ వేదికపైకి తీసుకొస్తున్నారు.

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సస్పెన్స్ తో సాగుతూ ఈ తరహా సినిమాలు, సిరీస్ లు ఉత్కంఠ కలిగిస్తాయి. ఇప్పుడు అలాంటి ఎలిమెంట్లతోనే రెడీ అయిన మూవీ 'పంచనామా'. ఈ క్రైమ్ థ్రిల్లర్ డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తుండటం విశేషం.

ఈ క్రైమ్ థ్రిల్లర్ పంచనామా సినిమాను జీ5 ఓటీటీ...