భారతదేశం, జూలై 14 -- OTT Telugu: ఈటీవీ విన్ ఓటీటీ తెలుగు రాష్ట్రాల్లోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు అలాంటిదే మరో మనసుకు హత్తుకునే సినిమాను ఆ ఓటీటీ తీసుకొస్తోంది. దీని పేరు మధురాపురి సదన. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సొంతింటి కోసం పడే కష్టాలు చుట్టూ తిరిగే ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. భరత్ సాయినాథ్ వర్మ, యషు మశెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా జులై 16న నేరుగా డిజిటల్ స్క్రీన్స్ పైకి రాబోతోంది.

ట్రైలర్ చూస్తుంటే అద్దె ఇళ్లలో ఉంటూ యజమానుల వేధింపులు భరించే ఒక సాధారణ కుటుంబం జర్నీ ఇది అని క్లియర్ గా అర్థమవుతోంది. "చిన్నప్పటి నుంచి గల్లీలో ఎన్ని అద్దె ఇళ్లు తిరిగాం.. ఇల్లు మారిన ప్రతిసారీ మనకో సొంత ఇల్లు ఉంటే బాగుండు అనిపించేది" అంటూ సాగే డైలాగ్స్ చ...