భారతదేశం, జూలై 26 -- OTT Telugu: యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్నేహా మణిమేగలై ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్ రోమాంటిక్ డ్రామా 'దీవానా' (Deewana). ఈ ఏడాది జూన్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. అయితే యూత్ నుంచి ఈ మూవీకి మంచి ఆదరణ వచ్చింది. థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది.

దీవానా చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ 'ఆహా' (Aha) దక్కించుకుంది. జూలై 31, 2026 నుంచి ఈ సినిమా అధికారికంగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 'మిస్ అయితే మస్ట్ ఫీల్ అయితవ్' అని పేర్కొంటూ ఓటీటీ రిలీజ్ డేట్ పోస్టర్ ను రిలీజ్ చేసింది ఆహా వీడియో ఓటీటీ ప్లాట్ ఫామ్.

అయితే 'ఆహా గోల్డ్' (Aha Gold) సబ్‌స్క్రైబర్లకు ఈ ఓటీటీ ప్రత్యేక ఆఫర్ కలిపించింద...