భారతదేశం, జూన్ 24 -- OTT Telugu: థియేటర్లలో బోల్తా కొట్టినా ఓటీటీలో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న 'పాపం ప్రతాప్' మూవీ ఇప్పుడు మరో ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. ఈ తెలుగు కామెడీ డ్రామా ఈ రోజు నుంచి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. దీని పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

తెలుగులో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన కామెడీ డ్రామా 'పాపం ప్రతాప్'. ఈ మూవీ ఏప్రిల్ 17, 2026న థియేటర్లలో రిలీజైంది. ప్రమోషన్స్ పరంగా ఈ మూవీ టీమ్ బాగానే ప్రయత్నించింది. కానీ తీరా థియేటర్లలో ఈ సినిమాకు అనుకున్నంత రీచ్ దక్కలేదు. దీంతో 20 రోజులకే ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చేసింది.

ఈటీవీ విన్ ఓటీటీలో పాపం ప్రతాప్ మూవీకి మంచి వ్యూయర్ షిప్ దక్కింది. ఈ కామెడీ డ్రామాను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ మరో ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి ప్రైమ్ వీడియోలో...