భారతదేశం, మే 17 -- OTT Telugu Crime Thriller Cmantham Released: ఓటీటీ వేదికలు ప్రతి వారం ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే విభిన్న కథాంశాలతో వచ్చే చిన్న చిత్రాలకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పెద్ద దిక్కుగా మారుతున్నాయి.

థియేటర్లలో ఆదరణ దక్కకపోయినా, ఓటీటీలో మాత్రం వీక్షకుల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకున్న తక్కువ బడ్జెట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో తెలుగు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమానే Cమంతం (Cmantham). ఇటీవలే సీమంతం ఓటీటీలోకి ప్రీమియర్‌కు వచ్చేసింది.

వజ్రయోగి, శ్రేయ భారతి ప్రధాన పాత్రల్లో నటించిన సీమంతం చిత్రానికి సుధాకర్ పాని దర్శకత్వం వహించారు. గతేడాది నవంబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, పెద్ద నటీనటులు లేకపోవడం, సరైన ప్రమోషన్లు లోపించడంతో బాక్సాఫీస్ వద్ద ప...