భారతదేశం, జూలై 16 -- టాలీవుడ్‌లో వైవిధ్యమైన ట్యూన్స్‌తో శ్రోతలను అలరించిన సింగర్ రఘు కుంచె ఈ మధ్య కాలంలో నటుడిగానూ తనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు. 'పలాస', 'దేవగుడి' వంటి చిత్రాల్లో విలక్షణమైన నెగెటివ్ పాత్రలతో మెప్పించిన ఆయన, పూర్తి స్థాయి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'గేదెల రాజు' (కాకినాడ తాలూకా).

"చూస్తే ఒకటే నిజం, చూడకపోతే వంద అనుమానాలు" అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ గేదెల రాజు ఓటీటీలోకి వచ్చేయనుంది. ఈ ఏడాది ఏప్రిల్ 24న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ, రఘు కుంచె నటనకు మాత్రం భారీ ప్రశంసలు దక్కాయి.

ఈ సినిమా కథ మొత్తం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ పరిసర ప్రాంతాల్లో సాగుతుంది. గేదెల రాజు అలియాస్ భగవంత్ రాజు (రఘు కుంచె) ఆ ప్రాంతంలో ఒక పేరుమోసిన రౌడీ షీటర్. ఎలాగైన...