భారతదేశం, ఏప్రిల్ 5 -- బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. గతేడాది పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన పరిణీతి చోప్రా ఇప్పుడు తల్లుల సమస్యలు, వారి మనోభావాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు 'మామ్ టాక్స్' (Mom Talks) అనే సరికొత్త టాక్ షోను ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన మామ్ టాక్స్ టీజర్‌ను ఆమె తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఈ షోలో మాతృత్వం, పితృత్వంపై మనసుకు హత్తుకునే చర్చలు ఉండనున్నాయి. నేహా ధూపియా, విక్రాంత్ మాస్సే-శీతల్ ఠాకూర్ జంట, ఇమ్రాన్ ఖాన్, గౌహర్ ఖాన్-జైద్ దర్బార్, దిశా పర్మార్ వంటి సినీ సెలబ్రిటీలు ఈ వేదికపై తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకోనున్నారు. పిల్లల పెంపకంలో ఎదురయ్యే సామాజిక ఒత్తిళ్లు, అపోహలపై పరిణీతి వీరితో కలిసి లోతుగా చర్చించనున్నారు.

ఈ కొత్త ప్రయత్నాన్ని చూసి గర్వపడుతున్న...