భారతదేశం, జూలై 18 -- OTT Malayalam Thriller: 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్‌టైమ్ రికార్డులు క్రియేట్ చేసిన డైరెక్టర్ చిదంబరం లేటెస్ట్ సైకలాజికల్ డ్రామా థ్రిల్లర్ 'బాలన్: ది బాయ్' (Balan: The Boy) ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూన్ 19న థియేటర్లలో రిలీజై సస్పెన్స్ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ క్రేజీ మూవీ.. జులై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) లో స్ట్రీమింగ్ కాబోతోంది.

మలయాళంలో గ్లోబల్ లెవెల్ హిట్ కొట్టిన 'మంజుమ్మెల్ బాయ్స్' తర్వాత చిదంబరం చేసిన సినిమా కావడంతో దీనిపై ట్రేడ్ వర్గాల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. దీనికి తోడు 'ఆవేశం' లాంటి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌కి కథ అందించిన జితు మాధవన్ ఈ సినిమాకి రైటర్‌గా వర్క్ చేయడం విశేషం. ఈ ఇద్దరు క్రేజీ టాలెంట్స్ కలిసి చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకు...