భారతదేశం, ఏప్రిల్ 24 -- OTT Malayalam: మలయాళ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చే థ్రిల్లర్లకు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అందుకే వీటిని ఓటీటీలోకి తెలుగులోనూ తీసుకొస్తుంటారు. అలాంటిదే మరో పొలిటికల్ థ్రిల్లర్ మూవీ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది.

ప్రేమమ్, సర్వం మాయ ఫేమ్ నివిన్ పాలీ, లెజెండరీ నటుడు బాలచంద్ర మీనన్ కలయికలో రూపొందిన 'ప్రతిఛాయ' (Prathichaya) మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు హడావుడి లేకుండా ఈ పొలిటికల్ డ్రామా నేరుగా జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రావడం విశేషం. మలయాళం, తెలుగు సహా మొత్తం ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

'ప్రతిఛాయ' సినిమా కథ పూర్తిగా రాజకీయ నేపథ్యం చుట్టూ తిరుగుతుంది. అధికార పీఠం కోసం జరిగే కుట్రలు, నాయకుల మధ్య ఉండే వైషమ్యాలు, సామాన్య ప్రజలపై రాజకీయ నిర్...