భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT Horror Thriller: ఆది పినిశెట్టి కథానాయకుడిగా నటించిన హారర్ థ్రిల్లర్ 'శబ్దం' (Sabdham) ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది. థియేటర్లలో విడుదలైన ఏడాది తర్వాత ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ విషయంలో తెలుగు ప్రేక్షకులు కొంత నిరాశకు గురైనప్పటికీ మొత్తానికి అది కూడా ఇప్పుడు పరిష్కారమైంది.

నిజానికి 'శబ్దం' సినిమా జీ5లో విడుదలైనప్పుడు కేవలం తమిళం, హిందీ భాషల్లోనే అందుబాటులో ఉంది. దీంతో ఆది పినిశెట్టికి మంచి మార్కెట్ ఉన్న తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు.

ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను పరిగణనలోకి తీసుకున్న ఓటీటీ యాజమాన్యం.. తాజాగా తెలుగు వెర్షన్‌ను కూడా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఇప్పుడు హారర్ ...