భారతదేశం, జూలై 7 -- OTT Crime Thriller: మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్ అంటేనే సౌత్ ఆడియన్స్‌కు ఒక సపరేట్ క్రేజ్. ఇప్పుడు అదే కోవలో ప్రేక్షకులకు చెమటలు పట్టించడానికి 'డోస్' (Dose) అనే పక్కా రా అండ్ రస్టిక్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి దూసుకువస్తోంది. ఏకంగా ఐదు బడా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఒకేసారి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవ్వడం ఇప్పుడు డిజిటల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు ఈ సినిమాకు ఐఎండీబీలోనూ 8.3 రేటింగ్ ఉంది.

సాధారణంగా ఒక సినిమా ఒకటో రెండో ఓటీటీల్లో రిలీజ్ అవుతుంది. కానీ 'డోస్' మూవీ మేకర్స్ మాత్రం డిజిటల్ మార్కెట్‌లో ఒక సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఈ శుక్రవారం అంటే జులై 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా వీడియో, సింప్లీ సౌత్, ఏపీ ఇంటర్నేషనల్, లయన్స్ గేట్ ప్లే.. ఇలా ఏకంగా ఐదు ప్లాట...