భారతదేశం, సెప్టెంబర్ 6 -- OTT Crime Thriller: ఓటీటీలో కొత్త కంటెంట్ కు కొదవే ఉండదు. డిఫరెంట్ స్టోరీలు, వేర్వేరు జోనర్లలతో కొత్త సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ కొత్త క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. అదే.. 'పంచనామా' సిరీస్. తాజాగా దీని ట్రైలర్ రిలీజైంది.

ఓటీటీలోకి తెలుగు క్రైమ్ మిస్టర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ 'పంచనామా' స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. సెప్టెంబర్ 11 నుంచి ఈ సిరీస్ జీ5 ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సిరీస్ ను మూడు హత్యల ఇన్వెస్టిగేషన్ సిరీస్ గా తెరకెక్కించినట్లు దీని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పంచనామా ట్రైలర్ ను మేకర్స్ ఇవాళ (సెప్టెంబర్ 6)న రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ తో ఈ తెలుగు వెబ్ సిరీస్ పై హైప్ మరింత పెరిగింది. ఇందులో 'ప్రేమిస్తే' భరత్ ...