భారతదేశం, జూన్ 1 -- Crime Thriller The Marked Women OTT Release In Telugu: తెలుగు రాష్ట్రాల్లో ఓటీటీ వీక్షకులకు క్రైమ్, సస్పెన్స్, మిస్టరీ థ్రిల్లర్ చిత్రాలు అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఓటీటీల్లో వచ్చే డిఫరెంట్ భాషల్లోని థ్రిల్లర్ సిరీస్‌లు, సినిమాలకు ఇక్కడి ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు.

'మనీ హైస్ట్' వంటి అంతర్జాతీయ ఓటీటీ సిరీస్‌లను ఆదరించిన ఇండియన్ ప్రేక్షకులను అలరించేందుకు మరో సరికొత్త మైండ్ బ్లోయింగ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ముందుకు వస్తోంది. ఆ సిరీస్ పేరే 'ది మార్క్‌డ్ ఉమెన్' (The Marked Woman). ఇందులో కాండెలా పెన్యా, అనా రుజాస్, పోల్ లోపెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా కథ మొత్తం ఒక వింత మిస్టరీ చుట్టూ తిరుగుతుంది. బార్సిలోనా నగరంలోని ఒక రేవు (పోర్ట్) లో ఉన్న కంటైనర్‌లో కాళ్లు, చేతులు కట్టేసి, నోట...