భారతదేశం, జూలై 5 -- Satluj OTT Streaming Without Sensor Cuts: బాలీవుడ్, పంజాబీ చిత్రసీమల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు దిల్‌జీత్ దోసాంజ్. ఆయన నటించిన మోస్ట్ కాంట్రవర్షియల్ మూవీ ఎట్టకేలకు భారతీయ ప్రేక్షకుల కోసం ఓటీటీలోకి వచ్చేసింది.

గత మూడేళ్లుగా సెన్సార్ బోర్డు చుట్టూ తిరుగుతూ, అనేక వివాదాల్లో చిక్కుకున్న 'పంజాబ్ 95' సినిమా.. ఇప్పుడు సరికొత్త పేరుతో నేరుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. 'సట్లజ్' (Satluj) అనే కొత్త టైటిల్‌తో జూలై 3 (శుక్రవారం) నుంచి జీ5 (ZEE5)లో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ జస్వంత్ సింగ్ ఖల్రా నిజ జీవిత కథ ఆధారంగా దర్శకుడు హనీ ట్రెహాన్ ఈ సినిమాను బయోగ్రాఫికల్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందించారు. పంజాబ్ చరిత్రలో అత్యంత చీకటి రోజులుగా భావించే 1984 నుంచి 1994 మధ్య...