భారతదేశం, మార్చి 18 -- ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ దేశాలు చేస్తున్న యుద్ధం సుమారు మూడు వారాలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి యుద్ధమే కాదు.. అసలు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దశాబ్దాలుగా ఈ వైరం అలాగే ఉంది. ఈ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ పై ఇప్పటికే ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ కూడా రూపొందాయి. తీవ్ర ఉత్కంఠ రేపే స్పై థ్రిల్లర్స్ నుంచి.. వాస్తవాల ఆధారంగా తెరకెక్కిన కథల వరకు ఈ దేశాల మధ్య ఉన్న శత్రుత్వం, రాజకీయ గొడవలు, అక్కడి ప్రజల కష్టాలను ఇవి మన కళ్లకు కడతాయి.

ఇజ్రాయెల్‌కు చెందిన ఈ స్పై థ్రిల్లర్ స్టోరీలో తమర్ రబిన్యాన్ అనే ఒక మొస్సాద్ సాంకేతిక నిపుణురాలు.. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను నాశనం చేయడానికి టెహ్రాన్‌లోకి ఒక రహస్య పని మీద వెళ్తుంది. ఆ పని విఫలమైనప్పుడు, ఆమె శత్రువుల దేశంలో చిక్కుకుపోతుంది. అప్పుడు ఇరాన్ గూఢచారి సంస్థ ఆమెను వెంబడిస్తుంది. ఆమె వాళ్ల...