భారతదేశం, మే 2 -- Oscars 2027 Rules Changed: ప్రపంచ సినిమా వేదికపై అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ నిబంధనలు మారాయి. 2027లో జరగనున్న 99వ ఆస్కార్ వేడుకల కోసం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారడమే కాకుండా, భారతీయ చిత్రనిర్మాతల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్' కేటగిరీలో భారత్ వంటి దేశాలకు ఇది పెద్ద ఊరటనిచ్చే పరిణామం.

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం, 'ఉత్తమ అంతర్జాతీయ చిత్రం' కేటగిరీకి ప్రతి దేశం నుంచి కేవలం ఒక్క సినిమాను మాత్రమే అధికారికంగా పంపే అవకాశం ఉండేది. దీనివల్ల మన దేశంలో ఆర్ఆర్ఆర్ వంటి భారీ చిత్రాలు వచ్చినా, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన ఒకే ఒక్క సినిమాకే ఆస్కార్ ...