భారతదేశం, సెప్టెంబర్ 18 -- దేశీయ షేర్ మార్కెట్లలో గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్​ఛేంజ్ (ఎన్​ఎస్​ఈ) రూ.22,569 కోట్ల భారీ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) గురువారం సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులోకి వచ్చింది. దేశీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ పబ్లిక్ ఇష్యూకి మొదటి రోజు నుంచే ఇన్వెస్టర్ల నుంచి నిలకడైన స్పందన లభించింది. డే 2 సబ్​స్క్రిప్షన్ నేపథ్యంలో ఎన్​ఎస్​ఈ ఐపీఓ జీఎంపీ సహా ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

బాంబే స్టాక్ ఎక్స్​ఛేంజ్ (బీఎస్​ఈ) గణాంకాల ప్రకారం.. మొదటి రోజు వ్యాపారం ముగిసే సమయానికి ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ మొత్తం 43 శాతం సబ్‌స్క్రిప్షన్ సాధించింది.

రిటైల్ ఇన్వెస్టర్ల కోటా: 44 శాతం భర్తీ అయింది.

నాన్-ఇన్​స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్​ఐ): 72 శాతానికి పైగా బిడ్లు వేశారు.

క్వాలిఫైడ్ ఇన్​స్టిట్యూషనల్ ...