భారతదేశం, జూలై 11 -- ప్రవాస తెలుగువారిని పార్టీ వైపు ఆకర్షించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు తెలుగుదేశం పార్టీ సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత విస్తరణ, అంతర్జాతీయ ఎన్‌ఆర్‌ఐ నెట్‌వర్క్ బలోపేతమే లక్ష్యంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నియామకం చేపట్టారు. గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ చీఫ్‌గా 'డాక్టర్ రాజా'ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

పార్టీ కోసం తెరవెనుక ఉండి విశేష సేవలు అందించిన డాక్టర్ రాజాను ఈ పదవి వరించింది. ఆయనకున్న నాయకత్వ లక్షణాలు, సంస్థాగత అనుభవం, అంతర్జాతీయంగా ఉన్న ప్రవాసాంధ్రులతో గల సత్సంబంధాలను పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు యువతను పార్టీ వైపు ఆకర్షించడం, వారి నైపుణ్యాలను రాష...