భారతదేశం, మార్చి 25 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 25 ఎపిసోడ్ లో.. మా అన్నయ్య కుటుంబం ఎందుకు సమస్యలతో ఇబ్బంది పడుతుందని సిద్ధాంతిని శ్యామల అడుగుతుంది. ముందు నా జాతకం చూసి కాపురం నిలబడాలంటే ఏ పరిహారం చేయాలో చెప్పండని శాలిని అడుగుతుంది. పాపాలకు పరిహారాలు ఉండవని క్రాంతి సీరియస్ అవుతాడు.

విరాట్, చంద్రకళ జాతకాలను సిద్ధాంతికి చూపిస్తారు. చంద్రకళ కడుపులో ఉన్న బిడ్డ భూమ్మీద పడితే ఈ ఇంట్లో ప్రాణ నష్టం సంభవిస్తుందని సిద్ధాంతి చెప్పేసరికి అందరూ షాక్ అవుతారు. కొంపదీసి ఆ ప్రాణం గండం విరాట్ కు ఉందా ఏంటీ? అని మాయ అంటుంది. రఘురాం కూడా ప్రాణాపాయం ఉందని అంటాడు.

ఆ గండం తప్పించడానికి ఎలాంటి పరిహారమైనా నేను చేస్తా. ఆయనకు ఏ చిన్న హానీ జరగకూడదని చంద్ర అడుగుతుంది. ప్రాణ గండం ఉంది ఆ బిడ్డ తండ్రికి కాదు, ఈ ఇంటి పెద్ద ప్రాణానికి అని సిద్ధాంతి చెప్తాడు. వారసుడ...