భారతదేశం, మార్చి 12 -- నిన్ను కోరి సీరియల్ టుడే మార్చి 12 ఎపిసోడ్ లో.. కడుపుతో ఉన్న చంద్రకళ కోసం రకరకాల పిండి వంటలు సిద్ధం చేస్తారు. కామాక్షి తినడానికి వస్తుంది. కానీ ఇవన్నీ చంద్ర కోసమని శ్యామల, జగదీశ్వరి చెప్తారు. అందరు కలిసి భోజనం చేస్తారు. చంద్రకు పొలమారితే అందరూ కంగారు పడతారు.

చంద్రకళను చూసి నాకు ఇలాంటి ఫ్యామిలీ ప్రేమ లేదు అని అనుకున్నా. తను లక్కీ అని ఫీల్ అయ్యానని మాయ అంటుంది. అందరు కలిసి భోంచేస్తారు. రాత్రి వెళ్లి తల్లి సునందను శాలిని కలుస్తుంది. ఎంతైనా మేనకోడలు కదా జగదీశ్వరి అలాగే చేస్తుందని సునంద అంటుంది. ఆ ఇంట్లో చంద్ర మహారాణిలా బతుకుతోంది. నేను బానిసలా సేవలు చేయాల్సి వస్తుందని శాలిని ఫ్రస్టేట్ అవుతుంది.

ఇవన్నీ చూస్తూ నాలో పగ ఎక్కువ అవుతుంది. వాళ్లను రాచి రంపానా పెట్టాలనే కసి పెరుగుతుంది. నా భర్త ఏమో అన్నావదినలు దైవంతో సమానమని ...