భారతదేశం, ఆగస్టు 31 -- Ninnu Kori Serial Today Episode: నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జగదీశ్వరి పంతులు గారిని పిలిపించి ముహూర్తం పెట్టమంటుంది. అప్పుడే వచ్చిన విరాట్ పంతులు గారు ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. దానికి జగదీశ్వరి నీ భార్య చంద్రకళకి మదన్‌కి నిశ్చయతార్ధం ఫిక్స్ చేయడానికి అని అంటుంది.

విరాట్ నా భార్యకి మ్యారేజ్ చేయటం ఏంటి అని అడుగుతాడు. ముందు ఆ మదన్ ని ఇంట్లో నుంచి బయటకి పంపేయండి అని విరాట్ అంటాడు. దానికి రఘురామ్ ముందు నువ్వు పెళ్లి చేసుకొని వచ్చిన మాయని బయటకి పంపించు ఆ తర్వాత మదన్‌ను పంపిస్తాం అని అంటాడు. దాంతో విరాట్ చిరాకు పడతాడు.

శ్రుతి, కామాక్షి వాళ్లు పంతులు మనం చెప్పినట్టే చేస్తాడు అని అనుకుంటారు. పంతులు ఇప్పటిలో మదన్ జాతకానికి మంచి ముహూర్తం లేదు అని అంటాడు. శ్రుతి, కామాక్షి సంతోషపడతారు. మదన్ టెన్షన్ పడతాడు. చంద్రన...