భారతదేశం, ఆగస్టు 28 -- హిమాలయ పర్వత ప్రాంతాల్లో సంభవించిన జలప్రళయం నేపాల్, టిబెట్ సరిహద్దు ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. వరదల ధాటికి వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది గల్లంతయ్యారు. ఇటువంటి ఆపద సమయంలో ఒకరికొకరు ఆసరాగా నిలిచి, మానవత్వాన్ని చాటిచెప్పాల్సింది పోయి.. మృతదేహాల నుంచి దోచుకుంటున్నారు! కొందరు వ్యక్తులు అత్యంత నీచంగా ప్రవర్తించారు. వరద నీటిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహం నుంచి పసిడి ఆభరణాలను దొంగిలించిన దారుణ సంఘటన నేపాల్‌లో వెలుగుచూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ప్రజలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నారాయణి నదిలో కొట్టుకొచ్చిన ఒక మహిళ మృతదేహాన్ని గమనించిన ఇద్దరు వ్యక్తులు, దానిని ఒడ్డుకు తీసి అధికారులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలను లాక్కున్నారు. ఆ...