భారతదేశం, ఆగస్టు 22 -- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత దిశగా ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(NEHS) అమలుకు సంబంధించి సమగ్ర బోర్డు ఆమోదిత మార్గదర్శకాలను విడుదల చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం(New Employees Health Scheme - NEHS) అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ​ట్రస్టీల బోర్డు ఆమోదంతో రూపొందించిన ఈ పాలనా, నిర్వహణ మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, EHCT ఛైర్మన్ సంజయ్ జాజు జారీ చేశారు.

ఈ నూతన మార్గదర్శకాలు జులై 17, 2026 నుండి...