భారతదేశం, జూన్ 21 -- దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే 'నీట్ యూజీ 2026' పునఃపరీక్షకు సమయం ఆసన్నమైంది. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో గత నెల (మే 3) జరిగిన పరీక్ష రద్దయిన సంగతి తెలిసిందే. ఆ చేదు జ్ఞాపకాలు, గత నెల రోజులుగా అనుభవించిన తీవ్ర మానసిక ఒత్తిడి, ఆందోళనలను పక్కనబెట్టి విద్యార్థులు నేడు (ఆదివారం, జూన్ 21) మళ్లీ పరీక్ష రాయబోతున్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. ఈసారి ఎలాంటి లోపాలు జరగకుండా పరీక్షను అత్యంత పారదర్శకంగా, సురక్షితంగా నిర్వహించేందుకు సర్వసన్నద్ధమైంది.

పరీక్షకు ఒక్క రోజు ముందు శనివారం సాయంత్రం ఎన్టీఏ అధికారులు భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈసారి అక్రమాలకు తావులేకుండా రికార్డు స్థాయిలో 51,311 జామర్లు, 1,38...