భారతదేశం, జూన్ 16 -- వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం.. మే 3న రాసిన 'నీట్ యూజీ 2026' అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. పేపర్​ లీక్​తో పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో అభ్యర్థులకు రావాల్సిన రీఫండ్ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకే బదిలీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. అధికారిక పోర్టల్‌లో అభ్యర్థులు అప్‌డేట్ చేసిన వివరాల ఆధారంగానే ఈ నగదు జమ అవుతుంది. కాబట్టి ఎలాంటి ఆలస్యం లేకుండా రీఫండ్ డబ్బులు చేరాలంటే.. పోర్టల్‌లో ఇచ్చిన బ్యాంక్ వివరాలు సరైనవేనా కాదా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది.

ఈ విషయమై సోషల్ మీడియా వేదిక 'X' (ట్విట్టర్) లో ఎన్‌టీఏ ఒక కీలక ప్రకటన చేసింది.

"అభ్యర్థులందరికీ రావాల్సిన నీట్​ యూజీ 2026 రీఫండ్ అమౌంట్ నేరుగా వారు అధికారిక పోర్టల్‌లో నమోదు చేసిన బ్యాం...