భారతదేశం, మార్చి 6 -- దేశవ్యాప్తంగా విద్యా పరిశోధన, శిక్షణ రంగంలో కీలక పాత్ర పోషించే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్​సీఈఆర్​టీ)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది ముఖ్య గమనిక. వివిధ అకాడమిక్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేడు, మార్చ్​ 6న ముగియనుంది.

వాస్తవానికి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 20వ తేదీనే ఆఖరి గడువుగా నిర్ణయించారు. అయితే, అభ్యర్థుల సౌకర్యార్థం ఈ గడువును మార్చ్​ 6 (శుక్రవారం) వరకు పొడిగించారు. నేటి సాయంత్రం 5 గంటల తర్వాత దరఖాస్తు లింక్ క్లోజ్​ అవుతుంది. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్​సీఈఆర్​టీ తన దిల్లీ ప్రధాన కార్యాలయంతో పాటు అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, ష...