భారతదేశం, మే 9 -- చాలా కుటుంబాల్లో అంతా బాగున్నట్టే కనిపిస్తుంది కానీ, అకస్మాత్తుగా సమస్యలు మొదలవుతాయి. పిల్లలు పదే పదే జబ్బు పడటం, భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలు రావడం, ఇంట్లోకి రాగానే ఏదో తెలియని అశాంతి కలగడం వంటివి మనం గమనిస్తుంటాం. జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం దీనిని దృష్టి దోషం లేదా నెగటివ్ ఎనర్జీ ప్రభావంగా పరిగణిస్తారు. మన పెద్దల కాలం నుండి వస్తున్న కొన్ని సంప్రదాయ చిట్కాలు ఈ ప్రతికూలతలను పారద్రోలడానికి అద్భుతంగా పనిచేస్తాయి.

చిన్న పిల్లలకు దిష్టి త్వరగా తగులుతుంది. పాలు తాగకపోవడం, అకారణంగా ఏడవడం, చికాకు పడటం వంటివి దృష్టి దోషానికి సంకేతాలు. ఇలాంటప్పుడు ఒక నిమ్మకాయను తీసుకుని దానిపై కొంచెం ఉప్పు చల్లాలి. ఆ నిమ్మకాయను పిల్లల తల నుండి పాదాల వరకు ఏడు సార్లు దిష్టి తీయాలి. అనంతరం ఆ నిమ్మకాయను ఎవరూ తొక్కని చోట లేదా ప్రవహి...