భారతదేశం, మార్చి 18 -- రాజకీయ విమర్శల్లో స్థాయిని మరచి ప్రవర్తించడం ఇటీవల కాలంలో ఎక్కువైపోతోంది. తాజాగా తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం, హీరోయిన్ నయనతారను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రవేశపెట్టిన 'నీ కనవు ననవాగ' (మీ కల మాకు చెప్పండి) అనే పథకాన్ని ఎద్దేవా చేసే క్రమంలో.. "నాకు నయనతార కావాలని కల వస్తే, ముఖ్యమంత్రి నెరవేరుస్తారా?" అంటూ ఎంపీ సీవీ షణ్ముగం కామెంట్స్ చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవ్వగా, సినీ ప్రముఖులు మంచు విష్ణు, ఖుష్బూ సుందర్ తాజాగా గట్టిగా బదులిచ్చారు.

ఈ వ్యవహారంపై నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా నిప్పులు చెరిగారు. "మహిళలు, ముఖ్యంగా నటీమణులు ఎవరికీ సొంత ఆస్తి కాదు. దారినపోయే ప్రతివాడు తమ సంభాషణల్లోక...