భారతదేశం, సెప్టెంబర్ 8 -- National Awards: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (72nd National Film Awards) ప్రెజెంటేషన్ వేడుకపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. గత 71 ఏళ్లుగా దేశ రాజధాని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఎంతో ఘనంగా జరుగుతున్న ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఈసారి గుజరాత్‌కు మార్చారు. సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తా నగర్ వద్ద ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం 'స్టాచూ ఆఫ్ యూనిటీ' (Statue of Unity) ఆవరణలో ఈ గ్రాండ్ ఈవెంట్ జరగబోతోంది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' (Ek Bharat, Shreshtha Bharat) స్ఫూర్తిని చాటిచెప్పేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్‌ను కేవలం ఢిల్ల...