భారతదేశం, మే 3 -- Pawan Kalyan Swachha Ratham : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ ఇప్పుడు ఒక సామాజిక ఉద్యమంగా మారింది. "మన పారిశుధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత" అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు క్షేత్రస్థాయిలో ఫలితాలను ఇస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పురుడుపోసుకున్న 'స్వచ్ఛ రథాలు' పల్లెల్లో చెత్తను సంపదగా మారుస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.

గత ఏప్రిల్ నెలలో ఈ స్వచ్ఛ రథాలు సాధించిన ప్రగతి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పల్లెల నుంచి రికార్డు స్థాయిలో సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్తను ఈ రథాలు సేకరించాయి. కేవలం సేకరించడమే కాకుండా, 'చెత్త నుంచి సంపద' సృష్టి అనే యజ్ఞంలో భాగంగా ఆ వ్యర్థాలకు బదులుగా రూ. 3.32 కోట్ల విలువైన నిత్యవసర వస్తువులను ప్రజలకు పంపిణీ చేశారు. అంటే...