భారతదేశం, జూలై 2 -- Nandini Reddy Samantha: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత సుదీర్ఘ విరామం తర్వాత 'మా ఇంటి బంగారం' చిత్రంతో గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది. నందినీ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. తాజాగా హిందూస్థాన్ టైమ్స్ తో ఇంటర్వ్యూలో సమంత, మా ఇంటి బంగారం మూవీ గురించి నందినీ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది.

"సమంతను ప్రేక్షకులు ఎన్నో ఏళ్లుగా గుండెల్లో పెట్టుకున్నారు. వారికి నచ్చిన, వారు ఇష్టపడే పాత సమంతను మళ్లీ వెండితెరపై చూపించాలని అనుకున్నాం. అదే జరిగింది. అందుకే ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు" అని నందినీ రెడ్డి వెల్లడించింది. ఈ సినిమా కేవలం ఒక కథ మాత్రమే కాదు, సమంతలోని అసలైన స్టార్‌డమ్‌ను సెలబ్రేట్ చేసే మూవీ అని డైరెక్టర్ చెప్పింది.

సమంత అంకితభావం గురించి నందినీ రెడ్డి ప్రశంసల ...