భారతదేశం, మార్చి 24 -- నల్లమల అడవుల్లో కొలువైన సలేశ్వర క్షేత్రం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు జాతర తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర. ఏప్రిల్ 6వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు అధికారులు, పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

'తెలంగాణ అమర్‌నాథ్' యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కృష్ణానది నుంచి జాలువారే జలపాతాల అలలతో పాటు అటవీ అందాలను వీక్షిస్తూ. యాత్ర ముందుకు సాగుతోంది. ఎత్తైన కొండల నడుమ వెయ్యడుగుల లోయలో కొలువైన పురాతన సలేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంగా వెళ్తుంటారు. 'వస్తున్నాం. వస్తున్నాం లింగమయ్య' అంటూ నినాదాలు చేస్తుంటారు.

ఈ జాతరకు వచ్చే భక్తులను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అడవిలోకి అనుమతి ఇస్తారు. ప్రతి ఏడాది ఓసారి ఇక్కడ జాతర జరు...