భారతదేశం, ఏప్రిల్ 22 -- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోసంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం (ఏప్రిల్ 22, 2026) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఒక శకం ముగిసింది.

1935 జూన్ 23న గుంటూరు జిల్లాలో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు వృత్తిరీత్యా న్యాయవాది. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన, 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా సేవలందించారు.

1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు, నాదెండ్ల కీలక పాత్ర పోషించారు. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా...