భారతదేశం, ఆగస్టు 9 -- దేశీయ మ్యూచువల్ ఫండ్ రంగంలో హెచ్‌డీఎఫ్‌సీ మిడ్ క్యాప్ ఫండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) తాజాగా రూ. లక్ష కోట్ల మైలురాయిని విజయవంతంగా దాటింది. పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్, హెచ్‌డీఎఫ్‌సీ ఫ్లెక్సీ క్యాప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ పథకంగా ఇది నిలిచింది.

అయితే ఈ భారీ మైలురాయి చూశాక మ్యూచువల్ ఫండ్ మదుపర్లలో ఒకటే సందేహం మొదలైంది. ఫండ్ పరిమాణం అతిగా పెరిగితే బలమైన రాబడులను అందించడంలో వెనుకబడుతుందా? కేవలం సైజు పెద్దదిగా ఉందనే కారణంతో మంచి ఫండ్స్‌ను వదిలేయవచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశంపై ప్రముఖ వెల్త్ మేనేజర్లు, ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్టులు స్పష్టతనిచ్చారు.

కేవలం ఫండ్ సైజు పెద్దదిగా ఉందని మ్యూచువల్...