భారతదేశం, మే 9 -- Musi River Rejuvenation Project : మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులకు లైన్ క్లియర్ అయింది. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ వేదికగా శనివారం ఈ ప్రాజెక్టుపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశాన్ని నిర్వహించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ప్రాజెక్టు పురోగతిపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అలైన్‌మెంట్, నిధుల సమీకరణ మరియు నిర్మాణ గడువుపై క్యాబినెట్ సబ్ కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఈ ప్రాజెక్టు కేవలం ఒక నిర్మాణ కాంట్రాక్ట్ మాత్రమే కాదని, ఇది నగరవాసులందరి సామాజిక బాధ్యత అని క్యాబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేసింది. "ప్రజల ఆస్తులకు, నివాసాలకు కనీస నష్టం కూడా కలగకూడదన్నదే మా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. అందుకే ఉన్న ని...