భారతదేశం, ఏప్రిల్ 8 -- బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమాతో తెలుగు వారి మనసు దోచుకుంది. ఇప్పుడు అడివి శేష్ డెకాయిట్ మూవీతో మరోసారి టాలీవుడ్ ఆడియెన్స్‌ను అలరించడానికి రెడీగా ఉంది. ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రూ. 1600 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో హీరో రణ్‌వీర్ సింగ్‌పై డేకాయిట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రశంసల వర్షం కురిపించారు. రణ్‌వీర్ అల్లాబాడియా పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మృణాల్ ఠాకూర్ తన సినీ ప్రయాణంలో రణ్‌వీర్ ఏ విధంగా అండగా నిలిచారో చెప్పుకొచ్చింది.

"రణ్‌వీర్ నా లక్కీ చార్మ్. ఈ రోజు నేను చిత్ర పరిశ్రమలో ఉన్నానంటే దానికి కారణం ఆయనే" అంటూ మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయింది. త...