భారతదేశం, మార్చి 29 -- ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా రిలీజ్ కు రంగం సిద్ధమైంది. శ్రీ విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మృత్యుంజ‌య్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. హత్యల వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే హీరోగా ఈ సినిమాలో శ్రీ విష్ణు నటించాడు.

శ్రీ విష్ణు లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'మృత్యుంజ‌య్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఏప్రిల్ 3 నుంచి మృత్యుంజ‌య్ సినిమా ఓటీటీ ఆడియన్స్ కు అందుబాటులోకి రానుంది.

మృత్యుంజ‌య్ సినిమా మార్చి 6, 2026న థియేటర్లలో రిలీజైంది. ఇందులో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, వీర్ ఆర్యన్, చిన్నా, సుదర్శన్ తదితరులు నటించారు. ఈ మూవీకి హుస్సేన్ షా కిరణ్ డైరెక్టర్. కాలభైరవ మ్యూజిక్ అందించిన ఈ మృత్యుంజ‌య్ మూవీకి థియేటర్లో మిక్స్ డ్ టాక్ వినిపించ...